RC17: మళ్ళీ కలుస్తున్న గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, మేవ‌రిక్ డైర‌క్ట‌ర్ సుకుమార్

ABN , Publish Date - Mar 25 , 2024 | 03:44 PM

రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలుస్తున్నారు. ఈ సారి 'రంగస్థలం' కన్నా అన్ని విధాలా ఎన్నో రేట్లు పెద్ద స్కేల్ తో సినిమా చెయ్యడానికి సుకుమార్ కథ తయారు చేస్తే, నిర్మాతలు బడ్జెట్ గురించి ఆలోచించేది లేదని చెపుతున్నారు. ఈ ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా వున్న పేరును దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఉంటుంది అని చెపుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించే టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది

RC17: మళ్ళీ కలుస్తున్న గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, మేవ‌రిక్ డైర‌క్ట‌ర్ సుకుమార్
Ram Charan and Sukumar join hands once again for RC17

అగ్ర దర్శకుడు సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి చేతులు కలుపుతున్నారు. ఈ ఇద్దరూ ఇంతకు ముందు 'రంగస్థలం' అనే ఒక అతి పెద్ద విజయవంతమైన సినిమా చేశారు. 'రంగస్థలం' సినిమా బాక్స్ ఆఫీస్ డాగర ఈ ఇద్దరి స్టామినా ఏంటో ఇంతకు ముందే నిరూపించింది. అలంటి ఈ ఇద్దరూ మళ్ళీ కలుస్తున్నారు, దీనికి ప్రస్తుతం రామ్ చరణ్ 17వ (RC17) సినిమాగా పిలుచుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా ఈ ఇద్దరి కాంబినేషన్ అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఈరోజు అధికారికంగా ఈ ఆర్.సి17 గురించి ప్రకటన రావటం ఆసక్తికరం. 'రంగస్థలం' నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాతలు అవటం ఇంకో అశ్శక్తికర అంశం.

ఆ సంస్థ సుకుమార్ రైటింగ్స్ తో కలిపి ఈ సినిమాని అత్యంత భారీ సినిమాగా తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దర్శకుడు ఈ సినిమా కథని 'రంగస్థలం' కంటే ఎన్నో రేట్లు రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే విధంగా రూపుదిద్దినట్టుగా తెలుస్తోంది. 'రంగస్థలం' రామ్ చరణ్ కెరీర్ లో నటుడిగా, కలెక్షన్స్ పరంగా ఎంతో ముఖ్యమైన సినిమా. అటువంటి సినిమా కన్నా ఇంకా పెద్ద స్కేల్ లో ఈ ఆర్సీ17 ఉండబోతోందని చెపుతున్నారు.

ramcharansukumar.jpg

ప్రస్తుతం సుకుమార్ 'పుష్ప 2' సినిమా చేస్తున్నారు, ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడిగా సుకుమార్ పేరు మారుమోగింది. అలాగే ట్రిపుల్ ఆర్ విజయం తరువాత రామ్ చరణ్ కి గ్లోబ‌ల్ ఐకాన్‌గా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మీద మ‌న ద‌గ్గ‌రే కాదు, దేశ వ్యాప్తంగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా అంచనాలు ఉన్నాయి. వాట‌న్నిటినీ అందుకునేలా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు సుకుమార్‌. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొద‌లుపెడ‌తారు. 2025 లాస్ట్ క్వార్ట‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకి మరోసారి రాక్‌స్టార్‌, మ్యూజిక్ సెన్సేష‌న్ దేవిశ్రీ ప్ర‌సాద్ పేరు తోడ‌వ‌డం అభిమానుల్లో మ‌రింత ఉత్సాహాన్ని పెంచేస్తోంది. 'రంగ‌స్థ‌లం' బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ కాంబినేష‌న్ మ‌రోసారి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ తో రెడీ అవుతోంది. ఇంత‌మంది హేమాహేమీలు క‌లిసి రూపొందిస్తున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమాటిక్ ఎక్స్ పీరియ‌న్స్ ని నెవ‌ర్ బిఫోర్ అన్న‌ట్టు క‌లిగించ‌నుంది అని పరిశ్రమలో ఒక టాక్ బయలుదేరింది.

Updated Date - Mar 25 , 2024 | 03:45 PM