దర్శక ధీరుడి సమర్పణలో...
ABN , Publish Date - Mar 20 , 2024 | 06:11 AM
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాతగా మారుతున్నారు. ప్రముఖ ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో కలసి కార్తికేయ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ను...
![దర్శక ధీరుడి సమర్పణలో...](https://media.chitrajyothy.com/media/2024/20240313/13_CJ_afa486313a.jpg)
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాతగా మారుతున్నారు. ప్రముఖ ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో కలసి కార్తికేయ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ను రూపొందించనున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమా, సినిమాకు ఎంచుకునే పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించే మళయాళ నటుడు, ‘పుష్ప’ ఫేమ్ ఫహాద్ ఫాజిల్ ఈ రెండు చిత్రాల్లోనూ నటిస్తుండటం విశేషం. కార్తికేయ ఈ మధ్య తెలుగులో డిస్ట్రిబ్యూటర్గా విడుదల చేసిన ‘ప్రేమలు’ చిత్రానికి ఫహాద్ పాజిల్ కూడా ఓ నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో ఒకటి ఫ్రెండ్ఫిప్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘ఆక్సిజన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. నూతన దర్శకుడు సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకుడు. మరో చిత్రం ఫ్యాంటసీ కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రం టైటిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకుడు. ఈ రెండు చిత్రాలకు వేటికవే భిన్నంగా, కంటెంట్ బేస్డ్గా తెరకెక్కనున్నాయి. ఈ సినిమాలను ప్రకటించిన సందర్భంగా కార్తీకేయ మాట్లాడుతూ ‘‘డిస్ర్టిబ్యూటర్గా నా తొలి చిత్రం ‘ప్రేమలు’ ద్వారా నాకు విజయాన్ని అందించి నాపై మీకున్న అపరిమితమైన ప్రేమను తెలియజేశారు. దీంతో మంచి చిత్రాలకు భాషాపరమైన భేదాలుండవనే నమ్మకం నాలో మరింతగా పెరిగింది. ఈ రెండు చిత్రాల్లో నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ బహుముఖ ప్రజ్ఞకు ప్రతిరూపం, నేనెంతగానో ఆరాధించే వ్యక్తి’’ అని అన్నారు.