పోలీస్ వారి హెచ్చరిక
ABN , Publish Date - Jan 10 , 2024 | 03:11 AM
బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పోలీస్వారి హెచ్చరిక’. అఖిల్ సన్నీ, అజయ్ఘోష్, రవికాలే ప్రధానపాత్రధారులు. బెల్లి జనార్థన్ నిర్మాత. ప్రస్తుతం చిత్ర ప్రధాన తారగణంపై పోరాట సన్నివేశాలను...
![పోలీస్ వారి హెచ్చరిక](https://media.chitrajyothy.com/media/2023/20231205/6_Cj_edb99ecff3.jpg)
బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పోలీస్వారి హెచ్చరిక’. అఖిల్ సన్నీ, అజయ్ఘోష్, రవికాలే ప్రధానపాత్రధారులు. బెల్లి జనార్థన్ నిర్మాత. ప్రస్తుతం చిత్ర ప్రధాన తారగణంపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘80 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు. సంజయ్ నాయర్, కాశీవిశ్వనాథ్, గడ్డేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కొండపల్లి నళినీకాంత్, సంగీతం: గజ్వేల్ వేణు.