వజ్రం లాంటి పింకీ
ABN , Publish Date - Jan 05 , 2024 | 06:51 AM
సుమన్, శుభలేఖ సుధాకర్, రవి అట్లూరి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పింకీ’. కిరణ్, మౌర్యాణి జంటగా నటించారు. సీరపు రవికుమార్ దర్శకత్వంలో...
![వజ్రం లాంటి పింకీ](https://media.chitrajyothy.com/media/2023/20231205/6_CJ_ba44b3e6ea.jpg)
సుమన్, శుభలేఖ సుధాకర్, రవి అట్లూరి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పింకీ’. కిరణ్, మౌర్యాణి జంటగా నటించారు. సీరపు రవికుమార్ దర్శకత్వంలో పసుపులేటి వెంకట రమణ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘రవికుమార్ చెప్పిన కథ నచ్చి ‘పింకీ’ చిత్రాన్ని నిర్మించాను. దర్శకుడు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించాడు’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది నా తొలి చిత్రం. మా నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. డైమండ్ కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ‘పింకీ’ కథ సాగుతుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్’ అని తెలిపారు. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు అని కిరణ్ చెప్పారు.