నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది
ABN , Publish Date - May 27 , 2024 | 01:16 AM
మహేశ్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమంలో మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్, సితార పాల్గొన్నారు...
![నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది](https://media.chitrajyothy.com/media/2024/20240511/5_CJ_d9346d846f.jpg)
మహేశ్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమంలో మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్, సితార పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంలో దిగిన ఫొటోలను మహేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. గౌతమ్.. నీ గ్రాడ్యుయేషన్ కు అభినందనలు. నీ కెరీర్లో ఓ నూతన అధ్యాయం మొదలైంది. ఈ చాప్టర్ను నువ్వే రాయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్కు రియాక్ట్ అయిన నమ్రతా.. ‘‘మాటల్లేవ్.. ప్రేమ మాత్రమే’’ అని కామెంట్ చేశారు.