మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rathnam: ‘డోంట్ వర్రీ రా చిచ్చా’.. మాస్ బీట్ అదిరింది

ABN, Publish Date - Mar 16 , 2024 | 11:11 AM

యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్‌కు ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే ‘రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతోంది. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరి డైరెక్టర్‌గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మాంచి మాస్ బీట్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Rathnam Movie Song Launch

మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్ (Vishal) సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో విశాల్‌ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటిది యాక్షన్ డైరెక్టర్ హరి (Director Hari)తో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్‌కు ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే ‘రత్నం’ (Rathnam) అనే మూవీ ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతోంది. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరి డైరెక్టర్‌గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్‌ను అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే మాస్ బీట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఇప్పటికే ఈ ‘రత్నం’ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ (Don’t Worry Ra Chiccha) అంటూ సాగే ఈ పాటను తాజాగా కాలేజ్‌లో విద్యార్థుల మధ్య రిలీజ్ చేయగా.. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పాటను రిలీజ్ చేసిన అనంతరం విశాల్ మాట్లాడుతూ.. ‘‘ఇలా కాలేజ్‌లో మా పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. డోంట్ వర్రీ మచ్చి.. ఎగ్జామ్స్ కోసం డోంట్ వర్రీ మచ్చి.. కష్టాలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ప్రతీ హీరోకి దేవీ శ్రీ ప్రసాద్‌ అదిరిపోయే పాట ఒకటి ఇస్తాడు. నాకు కూడా అలాంటి పాటను ఇవ్వమని అడిగాను. హరి నా జీవితాన్ని చూసి ఈ పాటను రాయించాడా? అని అనిపిస్తుంది’’ అని అన్నారు. (Massy Song From Rathnam Movie Out)


శ్రీమణి (Shreemani) రాసిన ఈ ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ పాటను దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీ మంచి ఎనర్జిటిక్‌గా ఉంది. ‘రత్నం’ షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 26న (Rathnam Release Date) ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా అధికారికంగా నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై వరుసగా అప్డేట్స్‌తో ‘రత్నం’ టీం సందడి చేయనుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Niharika: అది మూర్ఖ‌త్వ‌మే.. మళ్లీ పెళ్లి చేసుకుంటా కానీ..

***************************

*Venkatesh Daughter: ఘనంగా వెంకీ రెండో కుమార్తె వివాహం.. ఫొటోలు వైరల్

**************************

Updated Date - Mar 16 , 2024 | 11:49 AM