వినోదం ప్రధానంగా
ABN , Publish Date - Apr 29 , 2024 | 06:46 AM
‘బలగం, ఓం భీమ్ బుష్’ చిత్రాలతో సక్సె్సను అందుకొన్నారు నటుడు ప్రియదర్శి. ఇప్పుడు ఆయన హీరోగా కొత్త చిత్రం ఖరారైంది. నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా...
![వినోదం ప్రధానంగా](https://media.chitrajyothy.com/media/2024/20240428/111_CJ_109b650257.jpg)
‘బలగం, ఓం భీమ్ బుష్’ చిత్రాలతో సక్సె్సను అందుకొన్నారు నటుడు ప్రియదర్శి. ఇప్పుడు ఆయన హీరోగా కొత్త చిత్రం ఖరారైంది. నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బేనర్స్పై జాన్వీనారంగ్ నిర్మిస్తున్నారు. ‘సరికొత్త కాన్సె్ప్టతో వస్తున్న ఈ రొమాంటిక్ స్టోరీలో ప్రియదర్శి పాత్ర పూర్తి స్థాయి వినోదాన్ని పంచుతుంది. స్ర్కిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి జనవరిలో సెట్స్పైకి తీసుకెళ్తాం. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం’ అని మేకర్స్ తెలిపారు.