పాన్ ఇండియా ఎంటర్టైనర్ ప్రారంభం
ABN , Publish Date - Feb 16 , 2024 | 05:43 AM
తమిళ హీరో శివకార్తికేయన్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ఎంటర్టైనర్ షూటింగ్ బుధ వారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది...
![పాన్ ఇండియా ఎంటర్టైనర్ ప్రారంభం](https://media.chitrajyothy.com/media/2024/20240215/8_Cj_64449eb29b.jpg)
తమిళ హీరో శివకార్తికేయన్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ఎంటర్టైనర్ షూటింగ్ బుధ వారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయిక. శ్రీలక్ష్మీ మూవీస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇందులో శివ కార్తికేయన్ను మురుగదాస్ సరికొత్తగా చూపించబోతున్నారు. గురువారం నుంచే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించినట్లు యూనిట్ తెలిపింది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సుదీప్ ఎలామన్.