‘లగ్గం’ టాకీ పూర్తి
ABN , Publish Date - May 05 , 2024 | 06:27 AM
‘భీమదేవరపల్లి బ్రాంచి’ ఫేమ్ రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లగ్గం’. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు...
‘భీమదేవరపల్లి బ్రాంచి’ ఫేమ్ రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లగ్గం’. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, ఎల్ బి శ్రీరామ్, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టాకీ పార్ట్ను పూర్తి చేసుకుంది. ‘‘ప్రతీ ఒక్కరూ ఈ చిత్రం చూసి ఇందులోని సన్నివేశాల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఇందులోని స్టైల్ ఆఫ్ మేకింగ్, స్ర్కీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్ర దర్శకుడు రమేశ్ తెలిపారు. నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘‘కొన్ని తరాలు గుర్తుంచుకునేలా ఉంటుంది’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.