Kriti Shetty : మూడు పాత్రల చుట్టూ తిరిగే కథ
ABN , Publish Date - Jun 01 , 2024 | 04:28 AM
శర్వానంద్ హీరోగా నటించిన 35వ చిత్రం ‘మనమే’ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రకథానాయిక కృతి శెట్టి శుక్రవారం ఈ సినిమా విశేషాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
![Kriti Shetty : మూడు పాత్రల చుట్టూ తిరిగే కథ](https://media.chitrajyothy.com/media/2024/20240530/Kriti_Shetty_6a196e56ad.jpg)
శర్వానంద్ హీరోగా నటించిన 35వ చిత్రం ‘మనమే’ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రకథానాయిక కృతి శెట్టి శుక్రవారం ఈ సినిమా విశేషాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సినిమాలో నా పాత్ర పేరు సుభద్ర. ఇప్పటివరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేసిన నాకు ఈ పాత్ర చాలా కొత్తగా అనిపించింది. ‘ఇంత స్ట్రిక్ట్గా ఉండాలా’ అని దర్శకుడు శ్రీరామ్ను అడిగాను. అలాగే కావాలనడంతో ఆయన్ని ఫాలో అయ్యా.
శర్వానంద్ అద్భుతంగా నటించారు. నిన్నే సినిమా చూశా. ప్రతి సీన్లో ఆయన అదరగొట్టారు. ఇందులో నా ఫేవరెట్ సీన్ ఒకటుంది. దాని కోసం చాలా వెయిట్ చేశా. ఎలా చేయాలా అని ఆలోచించా. కానీ శర్వానంద్ చాలా క్యాజువల్గా వచ్చి ఒకే ఒక్క నిమిషంలో ఆ సీన్ చేయడంతో చాలా ఆశ్చర్యపోయా.
స్ట్రాంగ్ ఎమోషన్స్ కలిగిన ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ‘మనమే’. కిడ్, పేరెంట్ ఎమోషన్ కూడా ఉంది. గ్లోబల్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుంది. శర్వానంద్, నేను, పాప.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. అందుకే ‘మనమే’ అని పేరు పెట్టారు.
చిత్రం షూటింగ్ లండన్లో జరిగింది. అక్కడి వెదర్ ఎప్పటికప్పుడు మారిపోయేది. ఒక్కోసారి హఠాత్తుగా వర్షం పడేది. అటువంటి వాతావరణంలోనూ నిర్మాత చక్కగా ప్లాన్ చేయడం వల్ల షూటింగ్ బాగా జరిగింది.
ప్రస్తుతం మూడు తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. అలాగే ఓ మలయాళ సినిమా కూడా చేస్తున్నాను.