Upendra : మళ్లీ వస్తున్న ఉపేంద్ర ‘ఏ’
ABN , Publish Date - Jun 08 , 2024 | 05:17 AM
కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర కథానాయకుడిగా నటించిన బ్లాక్బస్టర్ చిత్రాల్లో ‘ఏ’ కు ప్రత్యేక స్థానం ఉంది. 26 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఓ కల్ట్
బెంగళూరు (ఆంధ్రజ్యోతి) : కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర కథానాయకుడిగా నటించిన బ్లాక్బస్టర్ చిత్రాల్లో ‘ఏ’ కు ప్రత్యేక స్థానం ఉంది. 26 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఓ కల్ట్ ఫిల్మ్గా నిలిచింది. ఎన్నో రికార్డులు నెలకొల్పింది. త్వరలో ఈచిత్రం మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ‘ఏ’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 21న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత లింగం యాదవ్ తెలిపారు. ఈ చిత్రంలో చాందినీ కథానాయికగా నటించారు.
ఇకపై ట్రోల్ చేయకండి నటుడు ఉపేంద్ర ఆగ్రహం
‘నన్ను మేథావి అంటూ ఇకపై ఎవరూ ట్రోల్ చేయకండి’ అని ఉపేంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి, అన్నింటా విజయం సాధించింది. దీంతో పవన్ కల్యాణ్తో ఉపేంద్రను పోలుస్తూ సోషల్ మీడియాలో పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఉపేంద్ర ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ని ఏర్పాటు చేసి పోటీ చేసినా ఒక్కచోటా గెలవలేకపోయారు. దీంతో ఆయనపై ట్రోల్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఉపేంద్ర స్పందించారు. తన గెలుపోటముల గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నానని, తాను గెలవాలనుకున్నప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి విజయం సాధిస్తానని పేర్కొన్నారు. తన రాజకీయ పార్టీ ‘ప్రజాకీయ’ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.