Prabhas: ఇటలీ ఫ్లైట్లో ప్రభాస్.. దిశా పటాని ఫొటో వైరల్
ABN , Publish Date - Mar 07 , 2024 | 04:11 PM
ప్రభాస్, నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా ఇటలీలో షూటింగ్ జరుగుతుండగా దిశా పటాని తీసిన ఓ ఫొటో వైరల్గా మారింది.
![Prabhas: ఇటలీ ఫ్లైట్లో ప్రభాస్.. దిశా పటాని ఫొటో వైరల్](https://media.chitrajyothy.com/media/2024/20240306/kalki_d66ff95718.jpg)
ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’(Kalki2898AD). వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్పై అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ (Kamal Haasan), దుల్హర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్, దీపికా పదుకొణె(Deepika Padukone), దిశా పటాని (Disha Patani) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
తాజాగా ఇటలీలో ప్రభాస్ అండ్ బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ (Disha Patani) పై ఓ సాంగ్ చిత్రీకరించగా దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటలీలోని పలు ప్రాంతాలలో పాట షూటింగ్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న క్రమంలో వెనకాల సీట్లో కూర్చున్న హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) ముందు వరుసలో ఉన్న ప్రభాస్ను తన ఫొన్తో ఫొటోలు తీసింది. ఇప్పుడా ఆ ఫొటోను కల్కి మూవీ టీం Kalki 2898 AD సోషల్ మీడియాలో పోస్టు చేయగా తెగ చక్కర్లు కొడుతోంది.