ఈతరం శ్రీరంగ నీతులు
ABN , Publish Date - Jan 09 , 2024 | 03:54 AM
రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘శ్రీరంగ నీతులు’. ప్రవీణ్కుమార్ వీఎ్సఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత...
![ఈతరం శ్రీరంగ నీతులు](https://media.chitrajyothy.com/media/2023/20231205/3_CJ_8393ba416d.jpg)
రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘శ్రీరంగ నీతులు’. ప్రవీణ్కుమార్ వీఎ్సఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత. ‘శ్రీరంగ నీతులు’ టీజర్ను విడుదల చేసి చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ తరం యువత ఆలోచనలు, భావోద్వేగాల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రమిద’న్నారు. కుటుంబ అనుబంధాలు, వినోదం.. ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత చెప్పారు. సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్. సినిమాటోగ్రఫీ: టీజో టామీ