‘రాజారాణి’ ఫీల్ కలిగింది
ABN , Publish Date - Apr 10 , 2024 | 01:45 AM
జీవీ ప్రకాశ్కుమార్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్విరాజ్ నిర్మించారు. ఈ చిత్రం తమిళంలో...
![‘రాజారాణి’ ఫీల్ కలిగింది](https://media.chitrajyothy.com/media/2024/20240407/2_CJ_05d18ce5e8.jpg)
జీవీ ప్రకాశ్కుమార్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్విరాజ్ నిర్మించారు. ఈ చిత్రం తమిళంలో ఈ నెల11న, తెలుగులో 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో జీవీ ప్రకాశ్ మాట్లాడుతూ ‘‘డియర్ అందరూ రిలేట్ చేసుకునే సినిమా. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కథ విన్నప్పుడు ‘రాజారాణి’ మూవీ ఫీల్ కలిగింది’’ అని చెప్పారు. దర్శకుడు ఆనంద్రవిచంద్రన్ మాట్లాడుతూ ‘‘గురక పెట్టడం ప్రతీ ఇంట్లో ఉండే సమస్య. దీనిపై కథ రాయడం చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో జీవీ ప్రకాశ్, ఐశ్వర్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది’’ అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది’’ అని ఆకాంక్షించారు. నటి ఐశ్వర్య మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకునే కంటెంట్ ఉంది’’ అని చెప్పారు.