సుకుమార్‌ సతీమణి సమర్పణలో..

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:11 AM

రావు రమేశ్‌ హీరోగా నటించిన ‘మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం’ ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు సుకుమార్‌ సతీమణి తబిత సమర్పణలో వస్తున్న తొలి చిత్రం ఇది...

రావు రమేశ్‌ హీరోగా నటించిన ‘మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం’ ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు సుకుమార్‌ సతీమణి తబిత సమర్పణలో వస్తున్న తొలి చిత్రం ఇది కావడం విశేషం. కంటెంట్‌ నచ్చడంతో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ ఆగస్టు 23న విడుదల చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్‌ ఆదివారం విడుదల చేశారు. ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ఎటకారం ఎక్కువున్న సుబ్రహ్మణ్యం భార్యగా ఇంద్రజ, అత్తగారిగా అన్నపూర్ణమ్మ నటించారు. ‘మా నాన్న అల్లు అరవింద్‌’ అంటూ గొప్పలు చెప్పి ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమలో పడేసే సుబ్రహ్మణ్యం కొడుకుగా అంకిత్‌ కొయ్య, అతని సరసన రమ్మ పసుపులేటి నటించారు. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య నిర్మించారు.

Updated Date - Jul 29 , 2024 | 04:11 AM