మలయాళంలో హిట్.. ఇప్పుడు తెలుగులో
ABN , Publish Date - Feb 20 , 2024 | 05:29 AM
మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’ ఇటీవల మలయాళంలో విడుదలై విజయం సాదించింది. చాలా కాలం తర్వాత పూర్తి బ్లాక్ అండ్ వైట్లో...
![మలయాళంలో హిట్.. ఇప్పుడు తెలుగులో](https://media.chitrajyothy.com/media/2024/20240215/15_CJ_20_0945ea4b8b.jpg)
మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’ ఇటీవల మలయాళంలో విడుదలై విజయం సాదించింది. చాలా కాలం తర్వాత పూర్తి బ్లాక్ అండ్ వైట్లో తయారైన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అదినేత సూర్యదేవర నాగవంశీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఉన్న వైవిధ్యమైన కథాంశం, మమ్ముట్టి అద్భుత నటన మలయాళ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. విమర్శకుల ప్రశంసలు పొందాయి. అందుకే అక్కడ ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం అలరిస్తుందని నిర్మాత చెబుతున్నారు. అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకుడు.