స్నేహ గీతం
ABN , Publish Date - Feb 14 , 2024 | 06:05 AM
ఇంద్ర, కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ ప్రధాన తారాగణంగా స్నేహం గొప్పతనాన్ని తెలిపే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు’. లక్ష్మణ్ జెల్ల దర్శకత్వంలో...
![స్నేహ గీతం](https://media.chitrajyothy.com/media/2023/20231205/9_CJ_a3ef847e28.jpg)
ఇంద్ర, కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ ప్రధాన తారాగణంగా స్నేహం గొప్పతనాన్ని తెలిపే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు’. లక్ష్మణ్ జెల్ల దర్శకత్వంలో చంద్ర ఎస్ చంద్ర, డాక్టర్ విజయ రమేశ్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం నుంచి ‘నా కల’ అంటూ సాగే గీతాన్ని సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కొత్త, పాత నటుల కాంబినేషన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. గాయని సునీత ఆలపించిన ఈ గీతం ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు అన్నారు. ఇందులో తన పాత్ర సరికొత్తగా ఉండబోతోందని ఇంద్ర చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ. సినిమాటోగ్రఫీ: రాహుల్ మాచినేని