DJ Tillu : వినోదం.. అంతకుమించి
ABN , Publish Date - Feb 15 , 2024 | 02:55 AM
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ విడుదల కోసం తుది మెరుగులు దిద్దుకుంటోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు...
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ విడుదల కోసం తుది మెరుగులు దిద్దుకుంటోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ను విడుదల చేశారు. మొదటి భాగంలో రాధికతో ప్రేమ కారణంగా ఇబ్బందులు తెచ్చుకున్న టిల్లు ఇప్పుడు మరోసారి అదే తరహాలో సమస్యల సమూహంలో చిక్కు కున్నట్లు ట్రైలర్లో చూపించారు. అనుపమ లుక్స్తో పాటు ఆమె బాడీ లాంగ్వేజ్, సిద్ధుతో ఆమె కెమిస్ట్రీ ఈ ట్రైలర్లో హైలైట్గా నిలిచాయి. కథకు సంబంధించిన అంశాలను ఎక్కువగా వెల్లడించకుండా .. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించేలా ట్రైలర్ను రూపొందించారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మొదటి భాగాన్ని మించి సీక్వెల్ ఉంటుందనే నమ్మకాన్ని ట్రైలర్తో కలిగించారు దర్శకుడు మల్లిక్ రామ్. రామ్ మిరియాల పాటలకు స్వరాలు అందించగా, సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.