కోటి రూపాయల విరాళం అందించిన ధనుశ్
ABN , Publish Date - May 15 , 2024 | 12:26 AM
తమిళ నటుడు ధనుశ్ తన సహృదయాన్ని చాటుకున్నారు. ‘సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ నూతన భవన నిర్మాణం కోసం కోటి రూపాయల విరాళం అందించారు. నడిగర్ సంఘానికి అధ్యక్షుడైన నాజర్...
![కోటి రూపాయల విరాళం అందించిన ధనుశ్](https://media.chitrajyothy.com/media/2024/20240511/3_CJ_54e86a253c.jpg)
తమిళ నటుడు ధనుశ్ తన సహృదయాన్ని చాటుకున్నారు. ‘సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ నూతన భవన నిర్మాణం కోసం కోటి రూపాయల విరాళం అందించారు. నడిగర్ సంఘానికి అధ్యక్షుడైన నాజర్ ఈ కోటి రూపాయల చెక్ను అందుకున్నారు. ధనుశ్కు కృతజ్ఞతతో అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ అసోసియేషన్లో నటుడు విశాల్ ప్రధాన కార్యదర్శి కాగా, నటుడు కార్తి కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఈ అసోసియేషన్కు ఇప్పటికే పలువురు కోలీవుడ్ స్టార్స్ భారీ విరాళాలు ఇచ్చారు. కమల్ హాసన్, విజయ్ కోటి రూపాయల విరాళం అందివ్వగా, శివ కార్తికేయన్ 50 లక్షలు ఇచ్చారు.