Sumaya Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘డియర్ ఉమ’ హీరోయిన్

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:28 PM

సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ‘డియర్ ఉమ’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తను నిర్మించిన తొలి సినిమా మంచి విజయం సాధించాలని హీరోయిన్ సుమయా రెడ్డి.. దైవ అనుగ్రహం పొందేందుకు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. తాజాగా ఆమె తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమలలో సుమయా రెడ్డి శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించి, ఆయన ఆశీస్సులు చిత్రంపై ఉండాలని కోరుకున్నారు.

Sumaya Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘డియర్ ఉమ’ హీరోయిన్
Sumaya Reddy

తెలుగమ్మాయి హీరోయిన్‌గా, నిర్మాతగా మారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అంటే సాధారణమైన విషయం కాదు. ‘డియర్ ఉమ’ (Dear Uma) సినిమాతో నిర్మాత, హీరోయిన్‌గా తెరపైకి రాబోతున్నారు సుమయా రెడ్డి (Sumaya Reddy). ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనుల్ని పూర్తి చేశారు. ఈ మధ్యే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందనను రాబట్టుకుంది. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తను నిర్మించిన తొలి సినిమా మంచి విజయం సాధించాలని హీరోయిన్ సుమయా రెడ్డి.. దైవ అనుగ్రహం పొందేందుకు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు.


Sumaya-Tirumala.jpg

ఈ క్రమంలో ఆమె దేవాలయాలకు విరాళం ఇస్తున్నారు. తాజాగా సుమయా రెడ్డి తిరుమల (Tirumala)లో ప్రత్యక్షమయ్యారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమలలో సుమయా రెడ్డి శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించి, ఆయన ఆశీస్సులు చిత్రంపై ఉండాలని కోరుకున్నారు. ‘డియర్ ఉమ’ చిత్రంలో సుమయ రెడ్డి, ‘దియా’ మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీని సుమయా రెడ్డి నిర్మించగా.. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:29 PM