జాతీయ పురస్కారం రద్దు
ABN , Publish Date - Oct 06 , 2024 | 02:52 AM
మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారం కేసులో పోక్సో చట్టం కింద అరెస్టయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు అందించాల్సిన జాతీయ అవార్డును రద్దు చేస్తూ...
మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారం కేసులో పోక్సో చట్టం కింద అరెస్టయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు అందించాల్సిన జాతీయ అవార్డును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకొన్నది. ఈ నెల 8న ఢిల్లీలో జరగనున్న జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డును అందుకోవాల్సి ఉంది. 2022 సంవత్సరానికి గాను తమిళ చిత్రం ‘తిరుచిత్రంబలం’కు గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. దీంతో ఆ వేడుకలకు హాజరయ్యేందుకు ఆయన బెయిల్ కోరగా రంగారెడ్డి కోర్టు మంజూరు చేసింది. కానీ అత్యాచారం కేసులో అరెస్టవడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఇవ్వాల్సిన పురస్కారాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.