అలరించే అమ్మపాట
ABN , Publish Date - Feb 27 , 2024 | 04:45 AM
విశ్వ కార్తిక్, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్ సంయుక్తంగా...
![అలరించే అమ్మపాట](https://media.chitrajyothy.com/media/2024/20240224/4_CJ_f8c4c6f23c.jpg)
విశ్వ కార్తిక్, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 22న ఈ చిత్రం విడుదలవుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. సోమవారం దర్శకుడు వశిష్ఠ చేతుల మీదుగా ‘జో జో లాలీ అమ్మ’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. పాట చాలా బావుందని యూనిట్ను ఆయన అభినందించారు. ఈ గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అజయ్ అరసాద స్వరాలు సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని.