22 ఏళ్ల తర్వాత...
ABN, Publish Date - Oct 06 , 2024 | 02:51 AM
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్రాజ్, సోనాలిబింద్రే నటించిన చిత్రం ‘ఖడ్గం’ రీ రిలీజ్కు సిద్ధమైంది. సినిమా విడుదలైన 22 ఏళ్లకు రీ రిలీజ్ అవుతుండడంతో...
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్రాజ్, సోనాలిబింద్రే నటించిన చిత్రం ‘ఖడ్గం’ రీ రిలీజ్కు సిద్ధమైంది. సినిమా విడుదలైన 22 ఏళ్లకు రీ రిలీజ్ అవుతుండడంతో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ ‘‘భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్ధేశం వచ్చేలా ఈ సినిమాకు టైటిల్ పెట్టాం. ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతుండడంతో చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.