ప్రతీకారంతో సాగే కథ
ABN , Publish Date - Dec 25 , 2024 | 03:42 AM
గౌరవ్, గోపాలరావు, నందినీ కపూర్, జబర్దస్త్ వినోదిని, రాకింగ్ రాకేశ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘బ్లడ్’. అవధూత గోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 27న...
గౌరవ్, గోపాలరావు, నందినీ కపూర్, జబర్దస్త్ వినోదిని, రాకింగ్ రాకేశ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘బ్లడ్’. అవధూత గోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 27న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక నిర్మాత అవధూత గోపాల్ మాట్లాడుతూ ‘‘ట్రెండ్కు తగ్గట్లు తెరకెక్కించిన సినిమా ఇది. హత్యకు గురైన ఓ యువతి దెయ్యంగా మారి తనకు అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సినిమా కథ’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో అందరికీ గుర్తుండిపోయే పాత్ర చేశాను’’ అని హీరో గౌరవ్ చెప్పారు.