పడమటి కొండల్లో ప్రేమకథ
ABN , Publish Date - Apr 24 , 2024 | 05:24 AM
అనురూప్ కటారి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పడమటి కొండల్లో’. నరేశ్ పెంట దర్శక త్వంలో జయకృష్ణ దురుగడ్డ నిర్మించారు. యశస్వి శ్రీనివాస్, శ్రావ్యారెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు...
![పడమటి కొండల్లో ప్రేమకథ](https://media.chitrajyothy.com/media/2024/20240413/8_CJ_658eea5193.jpg)
అనురూప్ కటారి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పడమటి కొండల్లో’. నరేశ్ పెంట దర్శక త్వంలో జయకృష్ణ దురుగడ్డ నిర్మించారు. యశస్వి శ్రీనివాస్, శ్రావ్యారెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం హీరో సాయి దుర్గ తేజ్ సోషల్ మీడియాలో ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ స్టిల్లో రక్తంతో తడిసిన కత్తిని పట్టుకొన్న హీరో గంభీరంగా కనిపించాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘పడమటి కొండల్లో’ సినిమాతో సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తాం. ఇందులో యాక్షన్తో పాటు ప్రేమకథ ఆకట్టుకుంటుంది. అందమైన లొకేషన ్లలో చిత్రీకరణ చేస్తాం. ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నాను’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కన్నన్ మునిసామి.