మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Article 370: సినిమా చూడకుండా ఆ నిర్ణయానికి ఎలా వస్తారంటూ యామీ ఫైర్‌!

ABN , Publish Date - Mar 02 , 2024 | 06:40 PM

యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్‌ జంభాలె దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టికల్‌ 370’. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై గల్ఫ్‌ సహా కొన్ని దేశాలు నిషేధం విధించడం ఇండస్ట్రీలో  చర్చనీయాంశంగా మారింది.

Article 370:  సినిమా చూడకుండా ఆ నిర్ణయానికి ఎలా వస్తారంటూ యామీ ఫైర్‌!

యామీ గౌతమ్‌ (Yami gaoutham) ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్‌ జంభాలె దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టికల్‌ 370’ (Article 370) ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై గల్ఫ్‌ సహా కొన్ని దేశాలు నిషేధం విధించడం ఇండస్ట్రీలో  చర్చనీయాంశంగా మారింది.  చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఆందోళనకరమైన ధోరణిలో ఉన్నాయని అందుకే నిషేధించి నట్లు తెలుస్తోంది. పలుమార్లు వాయిదాల తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే! శనివారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై యామీ గౌతమ్‌ స్పందించారు. ‘‘ఆర్టికల్‌ 370’ దేశంపై ఉన్న భక్తితో తీసిన సినిమా.  అసలు సినిమా ఏంటో, ఎలా తీశారో చూడకుండానే తీర్పు చెప్పేవారు ఉంటారు.

370.jpgకానీ ఆర్టికల్‌ 370 నిషేధాన్ని మేము ఊహించలేదు. ఇందులో ఆందోళనకరమైన సన్నివేశాలు లేవు. ప్రేరణ కలిగించే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మంచి సినిమా చూసి ఇంటికి వెళ్తున్నామన్న అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. అది మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సినిమా చూశాక తీర్పు చెప్పాలి కానీ ముందే ఎలా ఓ నిర్ణయానికి వస్తారు. ఈ సినిమా కశ్మీర్‌ అభివృద్థికి తోడ్పడుతుంది. ప్రచారం కోసం చేసింది కాదు’’ అని యామీ గౌతమ్‌  వెల్లడించారు. కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో యామీగౌతమ్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌గా యాక్షన్‌ హీరోయినగా నటించారు. ప్రియమణి కీలక పాత్రలో కనిపించారు. 

Updated Date - Mar 02 , 2024 | 06:48 PM