Tripti Dimri: ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు

ABN , Publish Date - Jan 25 , 2024 | 03:28 PM

ఈ మధ్యకాలంలో విపరీతంగా ట్రెండ్‌ అయిన హీరోయిన్  త్రిప్తి డిమ్రి (Tripti Dimri). ‘యానిమల్‌’లో(Animal) జోయాగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంతో ఆమె ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు. ‘యానిమల్‌’ తర్వాత త్రిప్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్ల సంఖ్య అమాంతం పెరిగింది.

Tripti Dimri: ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు

ఈ మధ్యకాలంలో విపరీతంగా ట్రెండ్‌ అయిన హీరోయిన్  త్రిప్తి డిమ్రి (Tripti Dimri). ‘యానిమల్‌’లో(Animal) జోయాగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంతో ఆమె ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు. ‘యానిమల్‌’ తర్వాత త్రిప్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్ల సంఖ్య అమాంతం పెరిగింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న త్రిప్తి ‘యానిమల్‌’ సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ ‘‘మనం ఏ రంగంలో పని చేసినా ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సినిమా ఇండస్ట్రీలో అది మరింత కష్టం. ఎన్నో ఎత్తుపల్లాలు చూడాలి. ప్రతి క్షణం ఓ పాఠమే. ఎన్నో నేర్చుకోవాలి. ‘యానిమల్‌’తో నాకు విశేష ఆదరణ లభించింది. సినిమా సక్సెస్‌ అవుతుందని ముందే ఊహించా. కానీ, నా పాత్రకు ఇంత పాపులారిటీ వస్తుందని అస్సలు అనుకోలేదు. ప్రేక్షకులు నాపై చూపించిన ఆదరణకు కృతజ్ఞురాలిని. రోజూ నిద్రపోయే ముందు చిత్ర బృందాన్ని గుర్తు చేసుకుని ధన్యవాదాలు చెబుతున్నాను. నా జీవితంలో ప్రత్యేకమైన క్షణాలివి. జోయాగా నటించినందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో సంతృప్తిగా ఉంది’ అని ఆమె అన్నారు. 

Tripthi-dimri.jpgఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ దృష్టి కూడా త్రిప్తి డిమ్రిపై పడింది. తెలుగులోనూ ఆమె అవకాశాలు అందుకొనున్నారని టాక్‌ వినిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ - గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్ట్‌లో త్రిప్తి హీరోయిన్‌గా కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది. 

Updated Date - Jan 25 , 2024 | 03:36 PM