కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OTT: కేరళస్టోరి ఓటీటీలో ఎక్కడ.. ఎప్పుడంటే

ABN, Publish Date - Jan 07 , 2024 | 10:45 AM

ఆదా శర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. (The kerala story) బాలీవుడ్‌ డైరెక్టర్‌ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళలోని బాలికలను ఇస్ల్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు.

ఆదా శర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. (The kerala story) బాలీవుడ్‌ డైరెక్టర్‌ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళలోని బాలికలను ఇస్ల్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో యోగీతా బలానీ, సిద్ది ఇద్నానీ(siddhi idnani) , సొనియా బలానీ కీలక పాత్రల్లో నటించారు. వివాదాస్పదంగా మారిన ఈ సినిమా ఎన్నో వివాదాలు నడుమ 2023 మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు సాధించింది. అతి తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం రిలీజై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వరకూ ఏ ఓటీటీలో రాలేదు. థియేటర్లలో సూపర్‌ హిట్‌ అయిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా కొత్త ఏడాదిలో ఈ చిత్రం ఓటీటీ రానున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 (zee5 Ott) సొంతం చేసుకున్నట్లు సమాచారం. మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఈ మూవీ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు త్వరలోనే గుడ్‌ న్యూస్‌ చెప్పనున్నారు మేకర్స్‌. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న లేదా జనవరి 19న స్ర్టీమింగ్‌ వచ్చే అవకాశమున్నట్లు సినీ ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Jan 07 , 2024 | 10:45 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!