OTT: కేరళస్టోరి ఓటీటీలో ఎక్కడ.. ఎప్పుడంటే
ABN , Publish Date - Jan 07 , 2024 | 10:45 AM
ఆదా శర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. (The kerala story) బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళలోని బాలికలను ఇస్ల్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు.
![OTT: కేరళస్టోరి ఓటీటీలో ఎక్కడ.. ఎప్పుడంటే](https://media.chitrajyothy.com/media/2023/20231205/Kerala_c03f0822ad.jpg)
ఆదా శర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. (The kerala story) బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళలోని బాలికలను ఇస్ల్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో యోగీతా బలానీ, సిద్ది ఇద్నానీ(siddhi idnani) , సొనియా బలానీ కీలక పాత్రల్లో నటించారు. వివాదాస్పదంగా మారిన ఈ సినిమా ఎన్నో వివాదాలు నడుమ 2023 మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించింది. అతి తక్కువ బడ్జెట్తో ఈ సినిమా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం రిలీజై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వరకూ ఏ ఓటీటీలో రాలేదు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా కొత్త ఏడాదిలో ఈ చిత్రం ఓటీటీ రానున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 (zee5 Ott) సొంతం చేసుకున్నట్లు సమాచారం. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఈ మూవీ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న లేదా జనవరి 19న స్ర్టీమింగ్ వచ్చే అవకాశమున్నట్లు సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.