Sonakshi Sinha: ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా..!

ABN , Publish Date - May 18 , 2024 | 12:01 PM

సీనియర్‌ నటి మనీషా కొయిరాలాకు క్షమాపణ చెప్పినట్లు సోనాక్షి సిన్హ వెల్లడించారు. తాజాగా హీరా మండి: ది డైమండ్‌ బజార్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె తాజా ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించారు.

Sonakshi Sinha: ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా..!

సీనియర్‌ నటి మనీషా కొయిరాలాకు (Manisha koirala) క్షమాపణ చెప్పినట్లు సోనాక్షి సిన్హ (Sonakshi Sinha) వెల్లడించారు. తాజాగా హీరా మండి: ది డైమండ్‌ బజార్‌’ (Heeramandi: The daimond Bazar) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె తాజా ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించారు. ‘హీరామండి’లో సోనాక్షీ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నెగెటివ్‌ రోల్‌లో కనిపించారు. వేశ్యల జీవితాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, రిచా చద్థా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు.

Sonak.jpg

తాజాగా సోనాక్షి సిన్హా మాట్లాడుతూ ‘‘నాకు మనీషా అంటే ఎంతో ఇష్టం. ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ వెబ్‌సిరీస్‌ మొత్తం చూసిన తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పాను. కొన్ని సన్నివేశాల్లో భాగంగా ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. సిరీస్‌ చూశాక నేను వాటిని ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే క్షమాపణ చెప్పాను. ఆమె గొప్ప నటి. తన సహనటులను ఎంతో ప్రోత్సహిస్తారు. షూటింగ్‌ మొత్తం సరదాగా గడిపాం. అంత గొప్ప నటితో కలిసి పనిచేేస అవకాశం రావడం నా అదృష్టం. మళ్లీ ఆమెతో నటించే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అన్నారు.

Sonakshi.jpg

సంజయ్‌ లీలా భన్సాలీ గురించి మాట్లాడుతూ.. ‘ఆయన దర్శకత్వంలో నటిస్తే కష్టపడాల్సిన అవసరం లేదు. సీన్‌కు ముందే అన్ని విషయాలు చర్చిస్తారు. భన్సాలీ నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత గొప్ప పాత్రను ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని చెప్పారు.


Read More: Tollywood, Bollywood, Cinema News

Updated Date - May 18 , 2024 | 12:01 PM