Shahrukh khan loose tongue: పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నా చిన్న చూపేనా షారుక్? 

ABN , Publish Date - Mar 04 , 2024 | 09:31 PM

అంబానీ వేడుకల్లో షారుక్ ఖాన్ రామ్ చరణ్ ను ఉద్దేశిస్తూ  చేసిన వాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో.. స్టేజ్ మీద 'నాటు నాటు' సాంగ్ ప్లే చేశారు. ఈ పాటకి  ఖాన్ త్రయం  డాన్స్ చేస్తుండగా, నీతా అంబానీ వేడుకలో రామ్ చరణ్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

Shahrukh khan loose tongue: పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నా చిన్న చూపేనా షారుక్? 

అంబానీ వేడుకల్లో షారుక్ ఖాన్ (Shah rukh khan) రామ్ చరణ్ ను (Ram charan) ఉద్దేశిస్తూ  చేసిన వాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో.. స్టేజ్ మీద 'నాటు నాటు' సాంగ్ ప్లే చేశారు. ఈ పాటకి  ఖాన్ త్రయం  డాన్స్ చేస్తుండగా, నీతా అంబానీ వేడుకలో రామ్ చరణ్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. షారుక్ ఖాన్ వెంటనే 'రామ్ చరణ్ ఎక్కడున్నావ్' అంటూ కేకలు వేశాడు. ఆ తర్వాత  'ఇడ్లీ సాంబార్ తినేసి.. కూర్చున్నావా.. బెండ్ ఇడ్లీ.. రామ్ చరణ్ ఎక్కడున్నావ్'  అంటూ పిలిచాడు. ఆ తర్వాత రామ్ చరణ్ స్టేజ్ మీదకు వచ్చాడు. ఖాన్ లతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు.

Ram charan.jpeg

అయితే ఈ  విషయంపై  ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబాహాసన్  ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. చరణ్ ను అలా పిలవటం బాధ కలిగించిందని ..‌ఈ ఘటన జరిగిన తర్వాత తాను ఆ వేడుక నుంచి వెళ్లిపోయానంది. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ ని స్టేజ్ మీదకు పిలిచే విధానం అయితే అది కాదు అంటూ స్పష్టం చేసింది. ఈ అయితే ఇదంతా చూసి..‌సౌత్ ఇండస్ట్రీ అన్నా, సౌత్ లో ఉండే టాలెంట్ అన్నా బాలీవుడ్ వాళ్లకు ఎప్పుడూ చిన్నచూపే అంటూ  నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు!  తెలుగు చిత్ర పారిశ్రమలో పాన్ ఇండియా స్థాయిలో ఉన్నా ఇంకా చిన్న చూపేనా షారుఖ్ ఖాన్ అంటూ అభిమానులు మండిపడుతున్నారు. 

Zeba-hassan.jpg

Updated Date - Mar 04 , 2024 | 09:53 PM