Sai Pallavi: బాలీవుడ్‌ ఎంట్రీ.. షూటింగ్‌ ఖరారు!

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:07 PM

లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. 2022లో వచ్చిన 'గార్గి' చిత్రం తర్వాత కొన్ని రోజులు ఆమె బ్రేక్‌ తీసుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్‌’ చిత్రంలో నటిస్తోంది.

 Sai Pallavi: బాలీవుడ్‌ ఎంట్రీ.. షూటింగ్‌ ఖరారు!



లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి (Sai Pallavi) మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. 2022లో వచ్చిన 'గార్గి'(Gargi) చిత్రం తర్వాత కొన్ని రోజులు ఆమె బ్రేక్‌ తీసుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్‌’ చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్  హీరోగా రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది సాయిపల్లవి. అంతే కాదు ఇప్పుడామె బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతోంది. ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) కుమారుడు జునైద్‌ ఖాన్‌ (Junaid Khan)హీరోగా నటిస్తున్న రెండో చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.

Sai-pallavi.jpg

ప్రస్తుతం ఆమె జపాన్ లో మంచు పండుగతో బిజీగా గడుపుతున్నారు.  అక్కడి సపోరో ప్రాంతంలో ఈ పండుగ జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ చిత్ర బృందం అక్కడే ఉన్నారు. అక్కడ మంచు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్స్‌లోని వర్కింగ్‌ స్టిల్స్‌ కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇప్పటి వరకు సపోరోలో ఏ సినిమా చిత్రీకరణ జరగలేదు. తొలిసారి ఈ చిత్రానికి అనుమతి దొరికింది. సునీల్‌ పాండే దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Updated Date - Feb 13 , 2024 | 03:12 PM