Rashmika Mandanna: హమ్మయ్యా.. తృటిలో మృత్యువు నుంచి బయటపడ్డాం
ABN , Publish Date - Feb 18 , 2024 | 02:05 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పెద్ద ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. అమె ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
![Rashmika Mandanna: హమ్మయ్యా.. తృటిలో మృత్యువు నుంచి బయటపడ్డాం](https://media.chitrajyothy.com/media/2024/20240215/rashmika_09ca76c747.jpg)
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) పెద్ద ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. గడిచిన రెండు సంవత్సరాలుగా వరుస హిందీ సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక ఎక్కువగా ముంబయ్లోనే ఉంటుంది. వేరే ఇతర సినిమాల షూటింగ్ల కోసం అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తూ సినిమా షూటింగ్లలో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే అమె ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది.
వివరాల్లోకి వెళితే.. ఈమధ్య ఓ తెలుగు చిత్రం షూటింగ్ కోసం రష్మిక మందన్నా (Rashmika Mandanna) ముంబయ్ నుంచి హైదరాబాద్కు బయలుదేరగా మరో నటి శ్రద్దాదాస్ (Shraddha Das) కూడా అదే విమానంలో ప్రయాణిస్తోంది. అయితే ఇది ఇలా ఉండగా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో మధ్యలోనే ముంబయ్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఈ ఘటనతో రష్మిక, శ్రద్దాదాస్ షాక్ గురయ్యారు. ఈ రోజు చావు నుంచి బయటపడ్డాం అంటూ వారికి ఎదురైన అనుభవాన్ని వారిరివురు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో సెకన్లలోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.దీంతో వాళ్ల అభిమానులు దైర్యంగా ఉండండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.