Preity Zinta: ‘నాకు కావాల్సింది అదే..  ముఖం కడుక్కొని రండి అన్నారు!

ABN , Publish Date - Feb 09 , 2024 | 01:44 PM

తన కెరీర్‌ బిగినింగ్‌ రోజులను నెమరు వేసుకున్నారు బాలీవుడ్‌ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా (Preity Zinta). మణిరత్నం దర్శకత్వం వహించిన ‘దిల్‌ సే’తో (Dil se)వెండితెరకు పరిచయమయ్యారామె. షారుక్‌ఖాన్ తో  కలిసి తెరపై సందడి చేశారు.

Preity Zinta: ‘నాకు కావాల్సింది అదే..  ముఖం కడుక్కొని రండి అన్నారు!

తన కెరీర్‌ బిగినింగ్‌ రోజులను నెమరు వేసుకున్నారు బాలీవుడ్‌ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా (Preity Zinta). మణిరత్నం దర్శకత్వం వహించిన ‘దిల్‌ సే’తో (Dil se)వెండితెరకు పరిచయమయ్యారామె. షారుక్‌ఖాన్ తో  కలిసి తెరపై సందడి చేశారు. అప్పటి ఫొటో ఒకటి ఇన్ స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రీతి. 

‘ఈ ఫొటో నా తొలి చిత్రం దిల్‌ సే’ షూటింగ్‌ తొలి రోజు తీసిన ఫొటో ఇది. మణిరత్నం, షారుక్‌లతో పని చేసే అవకాశం రావడం ఒక ఆనందంగా అయితే షూటింగ్‌ ఎప్పుడు మొదలువుతందా అని ఎంతో ఆతురతగా ఎదురుచూశా.  సెట్‌లోకి అడుగుపెట్టగానే మణి సర్‌ నన్ను చూసి నవ్వుతూ, మర్యాదపూర్వకంగా ముఖం కడుక్కొని రమ్మని చెప్పారు. నేను జోక్‌ చేస్తున్నారనుకున్నా. మేకప్‌ పోతుందని చెప్పా. ‘నాకు కావాల్సింది అదే. దయచేసి ముఖం కడుక్కుని రండి’ అని మరోసారి నవ్వుతూ చెప్పారు. దాంతో మేకప్‌ తీసేశాను. ఆ తర్వాత తీసిన క్లోజప్‌ షాట్‌ అద్భుతంగా వచ్చింది. ఈ ఫొటో నటిగా నా తొలి సన్నివేశం లోనిది. మా ఫొటోగ్రఫీ డైరెక్టర్‌కు సంతోష్‌ శివన్ కు  ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు ప్రీతి జింటా. 

తొలి సినిమా ‘దిల్‌ సే’ తోనే ప్రీతి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి తెలుగులో ‘ప్రేమంటే ఇదేరా’, రాజ్‌కుమారుడు’ చిత్రాలతో తెలుగు వారికీ చేరువైంది. అనంతరం వరుసగా బాలీవుడ్‌ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. 2016లో అమెరికాకు చెందిన జీన్‌ను ఆమె ప్రేమ పెళ్లి చేసుకున్నారు.


Updated Date - Feb 09 , 2024 | 01:45 PM