మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pop Singer Ed Sheeran: కాన్సెర్ట్‌ కోసం ముంబైకి.. ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసలు!

ABN, Publish Date - Mar 15 , 2024 | 06:54 PM

ప్రముఖ పాప్‌ సింగర్‌ ఎడ్‌ షీరన్‌ (Ed Sheeran) తన తదుపరి కాన్సర్ట్‌ కోసం ఇండియాకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు. శనివారం రాత్రి ముంబయిలో కాన్సర్ట్‌ (concert in mumbai) జరగనుంది.


ప్రముఖ పాప్‌ సింగర్‌ ఎడ్‌ షీరన్‌ (Ed Sheeran) తన తదుపరి కాన్సర్ట్‌ కోసం ఇండియాకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు. శనివారం రాత్రి ముంబయిలో కాన్సర్ట్‌ (concert in mumbai) జరగనుంది. ఈ సందర్భంగా బాలీవుడ్‌ సెలబ్రిటీలు అయన కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఇక్కడి ప్రజలు తన పాటలను ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారని తెలిపారు. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై (RRR) ప్రశంసల వర్షం కురిపించాడు.

‘‘దాదాపు ఏడాది క్రితం నా స్నేహితులతో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వీక్షించా. అద్భుతమైన చిత్రమిది. ‘నాటు నాటు’ (Naatu naatu) పాటలో డ్యాన్స్‌ చాలా బాగుంది. సాంకేతిక పరంగా కూడా ఈ చిత్రం నాకెంతో నచ్చింది’’ అని పేర్కొన్నారు. దీనిపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఆనందం వ్యక్తం చేసింది.

ముంబైలో షారుక్‌ఖాన ఏర్పాటు చేసిన పార్టీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నానీ, ఫర్హా ఖాన్‌, ఆయుష్మాన్‌ ఖురానా, అర్మాన్‌ మాలిక్‌ తదితరులు పాల్గొన్నారు. షారుక్‌తో కలిసి షీరన్‌ డ్యాన్స్‌ చేశారు. ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’ పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Updated Date - Mar 15 , 2024 | 06:56 PM