Mithun Chakraborty: అస్వస్థతకు గురై ఆస్పత్రిలో.. 

ABN , Publish Date - Feb 10 , 2024 | 12:16 PM

బాలీవుడ్‌ విలక్షణ నటుడు మిథున్‌ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

Mithun Chakraborty: అస్వస్థతకు గురై ఆస్పత్రిలో.. 

బాలీవుడ్‌ విలక్షణ నటుడు మిథున్‌ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం  కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రి ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Mithu-Chkravarthy.jpg

బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్‌ చక్రవర్తి (Mithun Chakraborty)1976లో మృగయా చిత్రంతో కెరీర్‌ ప్రారంభించిన ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆయన ఖాతాలో మరో రెండు జాతీయ అవార్డులు కూడా ఉన్నాయి. తెలుగులో 'గోపాల గోపాల' చిత్రంలో లీలాధర స్వామిగా నటించారు. తాజాగా భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. (Mithun Chakraborty Hospitalized)


Mithu-Chkravarthy-2.jpg

Updated Date - Feb 10 , 2024 | 12:18 PM