మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kriti Sanon: రెండు విభాగాల్లోనూ రాణించగలను!

ABN, Publish Date - Mar 17 , 2024 | 07:13 PM

బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ (krithi sanon) నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘దో పత్తీ’. ‘బ్లూ బటర్‌ ఫ్లై ఫిలిమ్స్‌’ పతాకంపై ఆమె నిర్మించిన మొదటి సినిమా ఇది. ఈ చిత్రం గురించి కృతీ తాజాగా ఓ వేదికపై మాట్లాడారు.

బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ (krithi sanon) నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘దో పత్తీ’. ‘బ్లూ బటర్‌ ఫ్లై ఫిలిమ్స్‌’ పతాకంపై ఆమె నిర్మించిన మొదటి సినిమా ఇది. ఈ చిత్రం గురించి కృతీ తాజాగా ఓ వేదికపై మాట్లాడారు. ‘‘నిర్మాతగా నా మొదటి సినిమా కోసం రోజుకు 16 నుంచి 17 గంటలు పని చేశాను. ఏ సన్నివేశం అయినా అనుకున్న విధంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నా. ఈ సినిమాను ఛాలెంజ్‌ తీసుకుని నిర్మించాను. స్క్రిప్ట్, పాత్రలు, సంగీతం అన్ని విభాగాల్లో  భాగమయ్యాను. సినిమా బడ్జెట్‌ గురించి అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. నటిగా, నిర్మాతగా రాణించగలనని నమ్మకం కుదిరింది’’ అని తాజాగా పాల్గొన్న టీవీ షోలో తెలిపింది.

ఇదిలా ఉండగా కృతిసనన్ నటిగా మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. కరీనా కపూర్‌, టబుతో కలిసి నటించిన ‘క్రూ’ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకే చోట పని చేసే  ముగ్గురు మహిళల జీవితాన్ని విధి ఏవిధంగా మలుపు తిప్పిందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. 

Updated Date - Mar 17 , 2024 | 07:13 PM