Katrina Kaif: తప్పకుండా నాకంటూ ఓ పేజీ ఉంటుంది!
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:26 PM
'మల్లీశ్వరి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు కట్రీనా కైఫ్ (Katrina Kaif) ఆ తర్వాత తెలుగులో రెండు చిత్రాల్లో నటించినా.. ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్కే పరిమితమయ్యారు. పెళ్లి తర్వాత కాస్త సినిమాలు కూడా తగ్గించారు.
![Katrina Kaif: తప్పకుండా నాకంటూ ఓ పేజీ ఉంటుంది!](https://media.chitrajyothy.com/media/2024/20240413/Kat_6e8593da1b.jpeg)
'మల్లీశ్వరి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు కట్రీనా కైఫ్ (Katrina Kaif) ఆ తర్వాత తెలుగులో రెండు చిత్రాల్లో నటించినా.. ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్కే పరిమితమయ్యారు. పెళ్లి తర్వాత కాస్త సినిమాలు కూడా తగ్గించారు. అయితే తాజాగా ఆమెకు హాలీవుడ్ (Hollywood Film) నుంచి ఓ అవకాశం వచ్చిందట. అయితే అనివార్య కారణాల వల్ల వదులుకున్నట్లు ఆమె చెబుతున్నారు. అయితే తప్పకుండా మరో అవకాశం వస్తుందని, అది నటిగా తన ప్రయాణాన్ని మలుపు తిప్పేదిగా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది. గత ఏడాది 'టైగర్-3' (Tiger3) చిత్రంతో అలరించిన క్యాట్ ఈ ఏడాది 'మేరీ కిస్టమస్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ '‘ఇటీవలే ఓ హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వస్తే కొన్ని కారణాల వల్ల తిరస్కరించాను. తిరిగి తప్పక ఆ అవకాశం వస్తుందని నమ్ముతున్నా. దాంతో నా సినీ జీవితం అనే పుస్తకంలో ఓ కొత్త పేజీ రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నా’ అని అన్నారు.
ఒక్కసారి వెనక్కి వెళ్లి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు కట్రీనా. ‘హిందీలో చేసిన ‘బూమ్’ తర్వాత నేను ‘మల్లీశ్వరి’తో దక్షిణాదికి పరిచయమయ్యా. అక్కడి నుంచే కెమెరా అనుభవం పొందడం ప్రారంభించాను. తర్వాత నెమ్మదిగా దర్శకనిర్మాతలతో చర్చించడం అలవాటు చేసుకున్నా. అనుకున్నవన్నీ సాధించాను. ఎప్పటికీ నా మనసంతా సినిమాలపైనే ఉంటుంది’. నన్ను అభిమానించే ప్రేక్షకులకు ఎప్పుడూ మొదటిస్థానం ఇస్తాను. ఏ కథకు వారు బాగా కనెక్ట్ అవుతారని ఆలోచిస్తూ.. మంచి కథలు ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాను’’ అని తెలిపారు కట్రీనా.
Keerthy Bhat: దీన స్థితిలో ఉన్నానని కూడా లేకుండా ఎక్కడెక్కడో తాకేవారు!
Read More: Tollywood, Cinema News