Karan Johar: అధికారికంగా చెప్పే వరకూ వేచి చూడండి! 

ABN , Publish Date - Jan 06 , 2024 | 05:09 PM

వరుణ్‌ ధావన్  - అలియా భట్‌ జంటగా నటించిన చిత్రం ‘దుల్హనియా’. రెండు భాగాలుగా విడుదలై అలరించింది. త్వరలోనే దీనికి కొనసాగింపుగా మూడో పార్ట్‌ రానుందంటూ వార్తలొస్తున్నాయి. అందులో అలియా భట్‌ ప్లేస్‌లో దర్శకనిర్మాతలు జాన్వీకపూర్‌ను ఎంపిక చేశారని టాక్‌ వినిపిస్తోంది.

Karan Johar: అధికారికంగా చెప్పే వరకూ వేచి చూడండి! 

వరుణ్‌ ధావన్  - అలియా భట్‌ జంటగా నటించిన చిత్రం ‘దుల్హనియా’. రెండు భాగాలుగా విడుదలై అలరించింది. త్వరలోనే దీనికి కొనసాగింపుగా మూడో పార్ట్‌ రానుందంటూ వార్తలొస్తున్నాయి. అందులో అలియా భట్‌ ప్లేస్‌లో దర్శకనిర్మాతలు జాన్వీకపూర్‌ను ఎంపిక చేశారని టాక్‌ వినిపిస్తోంది. ఇటీవల. కాఫీ విత్‌ కరణ్‌ ఎపిసోడ్‌లో జాన్వీ కపూర్‌ గెస్ట్‌ కనిపించినప్పటి నుంచే ఈ రూమర్‌ మొదలైంది. తాజాగా దీనిపై నటుడు, దర్శకుడు కరణ్‌ జోహార్‌ స్పందించారు.

Janvey.jpg

‘‘ప్రతి రోజు నిద్రలేవగానే ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక రూమర్‌ వినిపిస్తోంది. నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకుండా ఇలా ప్రచారమయ్యే వార్తలను నమ్మవద్దని అభిమానులు అర్థిస్తున్నాను. సరైన సమయం వచ్చినప్పుడు మేము దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ఈ చిత్రం సీక్వెల్‌ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’’ అని తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. 

Updated Date - Jan 06 , 2024 | 05:13 PM