Kangana Ranaut: లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడం కారణంగా ఆలస్యం!

ABN , Publish Date - May 16 , 2024 | 02:24 PM

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ పోస్ట్‌ పెట్టింది.

Kangana Ranaut: లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడం కారణంగా ఆలస్యం!


బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ((Kangana Ranaut) నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency)సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ పోస్ట్‌ పెట్టింది. ఈ సినిమాను జూన్‌ 14న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, కంగనా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో వాయిదా వేశారు.

Emergency.jpg
‘మా క్వీన్‌ కంగనా రనౌత్‌పై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. దేశం కోసం తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, దేశానికి ేసవ చేయాలని ఆమె నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి సమయాన్ని రాజకీయాలకు ఇస్తున్నారు. అందుకే ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ సినిమా కచ్చితంగా మీకు నచ్చుతుందని హామీ ఇస్తున్నాం. నిరంతరం సపోర్ట్‌ చేస్తున్నందుకు కృతజ్ఞతతలు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగన.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. కంగనా రనౌత హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేయనున్న విషయం తెలిసిందే.

Updated Date - May 16 , 2024 | 02:24 PM