Kangana Ranaut: సందీప్ వంగాతో పని చెయ్యాలా? సంచలన కామెంట్స్ చేసిన కంగనా

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:16 PM

'యానిమల్' దర్శకుడు సందీప్ వంగా ఆ సినిమాతో విజయం సాధించినా, ఆ సినిమాపై విమర్శలని కూడా చాలామంది చేశారు. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ బాలీవుడ్ నటి కంగన రనౌత్ తో పని చేయాలనుకుంటున్నట్టు చెప్పగా, దానికి సమాధానంగా కంగన ఏమి చెప్పారో తెలిస్తే షాకవుతారు

Kangana Ranaut: సందీప్ వంగాతో పని చెయ్యాలా? సంచలన కామెంట్స్ చేసిన కంగనా
Kangana Ranaut and Sandeep Vanga

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన 'యానిమల్' చాలా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు రూ. 800 కోట్ల వరకు వసూలు చేసి బాలీవుడ్ లో ఒక సంచలనం రేపింది. ఈ సినిమా బాగుందని కొందరు అంటే, విమర్శలు కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి. ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో ఉండగానే, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్ ఫ్లిక్స్ లో చూసిన చాలామంది సెలెబ్రిటీలు ఈ సినిమా స్ట్రీమింగ్ ఆపేయాలని సినిమా మీద విపరీతమైన విమర్శలు చేస్తున్న సంగతి కూడా తెలిసిన విషయమే. అయితే ఇలా విమర్శించిన వారందరికీ ఈమధ్య ఒక ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ వంగా సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు.

Kangana.jpg

అలాగే ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఈ సినిమాని విమర్శించారు. అయితే కంగనా గురించి సందీప్ వంగా మాట్లాడుతూ ఆమె ప్రతిభ గల నటి అని, 'క్వీన్' సినిమాలో ఆమె చేసిన నటనకి ప్రశంసించాలని, ఆమె మంచి నటి అని ఆమెతో పనిచేయాలని అనుకుంటున్నాని చెప్పాడు సందీప్. ఆమె ఒకే అంటే కథని వినిపిస్తాను అని కూడా చెప్పాడు ఆ ఇంటర్వ్యూ లో. కంగన ఈ ఇంటర్వ్యూ క్లిప్ ని తన సామజిక మాధ్యమం అయిన 'ఎక్స్' పోస్ట్ చేసి, నేను నీతో పనిచేయాలని అనుకోవటం లేదని కరాఖండీగా చెప్పేసింది.

తన సినిమాల గురించి, తన పని గురించి సందీప్ వంగా మాట్లాడిన మాటలకి అతనికి గౌరవం ఇస్తూనే, చాలా క్లియర్ గా తనకి ఎటువంటి పాత్ర అతని సినిమాలో ఆఫర్ చెయ్యొద్దని చెప్పేసారు కంగన. ఎందుకంటే అతని 'యానిమల్' లో అంతా మగవాళ్ల ఆధిపత్యం, ఆడవాళ్ళని కించపరిచే విధంగా వుండే సన్నివేశాలు ఉన్నాయని చెప్పారు కంగన. వృత్తిపరంగా సందీప్ వంగాతో కలిసి పని చెయ్యడానికి ఇష్టం చూపించలేదు కంగన.

sandeepreddyvanga.jpg

ఈ సినిమాలో చాలా కాలం తరువాత బాబీ డియోల్ ని విలన్ గా చూపించడం, అతనికి మంచి పేరు రావటం జరిగింది. ఈ సినిమా డిసెంబర్ 1, 2023న విడుదలై, విజయవంతం అయిన సంగతి తెలిసిన విషయమే. సందీప్ వంగా ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే సినిమా తన తదుపరి ప్రాజెక్ట్ గా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఇదే కాకుండా, అల్లు అర్జున్, మహేష్ బాబు అలాగే 'యానిమల్ పార్క్' అని 'యానిమల్' కి సీక్వెల్ కూడా వుండబోతోంది అని కూడా ప్రకటించాడు సందీప్.

Updated Date - Feb 06 , 2024 | 04:16 PM