మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Janhvi -Khushi Kapoor: ఒకే వేదికపై అక్కాచెల్లెళ్ల సందడి!

ABN , Publish Date - Mar 03 , 2024 | 05:30 PM

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvikapoor), తన చెల్లి ఖుషీ కపూర్‌తో (Khushi Kapoor) కలిసి ఫేమస్‌ పాటకు కలిసి డ్యాన్స్‌ చేశారు. వీళ్లిద్దరితో పాటు అనన్య పాండే, సారాఅలీఖాన్‌ కూడా కలవడంతో ఈ నలుగురి డాన్స్  టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 Janhvi -Khushi Kapoor: ఒకే వేదికపై అక్కాచెల్లెళ్ల సందడి!


బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvikapoor), తన చెల్లి ఖుషీ కపూర్‌తో (Khushi Kapoor) కలిసి ఫేమస్‌ పాటకు కలిసి డ్యాన్స్‌ చేశారు. వీళ్లిద్దరితో పాటు అనన్య పాండే, సారాఅలీఖాన్‌ కూడా కలవడంతో ఈ నలుగురి డాన్స్  టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌, ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక  ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జామ్‌నగర్‌ వేదికగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్‌ స్టార్స్‌ అందరూ సందడి  చేస్తూ దేశవ్యాప్తంగా విచ్చేసిన అతిథుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. (Ananthradhika wedding)

ఇందులో భాగంగానే బాలీవుడ్‌ హీరోయిన్స్‌ జాన్వీ, ఖుషీ, సారా అలీఖాన్‌, అనన్య పాండే హిందీ చిత్రం ‘కభీ ఖుషీ కభీ గమ్‌’లోని ‘బోలె చూడియాన్‌ బోలే కంగనా’ పాటకు స్టెప్పులేశారు. ప్రముఖ ఫ్యాషన్  డిజైజైనర్‌ మనీశ్‌ మల్హోత్రతో కలిసి కలర్‌ఫుల్‌ ప్రదర్శన ఇచ్చారు. ఇది చూసిన వారంతా జాన్వీ గ్రేస్‌ఫుల్‌గా చేసిందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ వేడుకల్లో ఇదే బెస్ట్‌ డ్యాన్స్‌ అంటున్నారు.


అలాగే, బాలీవుడ్‌ హీరోలతో కలిసి రామ్‌ చరణ్‌ ‘నాటునాటు’ స్టెప్‌ వేశారు. మొదట షారుక్‌, సల్మాన్‌, ఆమిర్‌ ఖాన కూడా ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఆ తర్వాత రామ్‌ చరణ్‌ను షారుక్‌ స్టేజ్‌కు మీదకు రావాలంటూ ఆహ్వానించారు. అనంతరం ఖాన త్రయంతోపాటు చరణ్‌ కూడా నాటు నాటు అంటూ స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడయో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Updated Date - Mar 03 , 2024 | 05:31 PM