Janhvi kapoor: తిరుమల మోకాళ్ళ పర్వతం దగ్గర ఏం చేసిందో తెలుసా?

ABN , Publish Date - Mar 21 , 2024 | 02:54 PM

శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ జాన్వీకపూర్‌కి దైవభక్తి ఎక్కువ. అందులోనూ తిరుమల శ్రీనివాసుడు అంటే ఆమెకు మరింత భక్తి. అందుకే తరచూ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమల వెళ్తుంటుంది.

Janhvi kapoor: తిరుమల మోకాళ్ళ పర్వతం దగ్గర ఏం చేసిందో తెలుసా?


శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ జాన్వీకపూర్‌కి దైవభక్తి ఎక్కువ. అందులోనూ తిరుమల శ్రీనివాసుడు అంటే ఆమెకు మరింత భక్తి. అందుకే తరచూ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమల వెళ్తుంటుంది. తాజాగా ఈ నెల 6న ఆమె తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుంది. ఆమెతోపాటు స్నేహితులు శిఖర్‌ పహారియా, ఒరీతో కలిసి అలిపిరి నుంచి కాలి నడకన శ్రీవారి సన్నిధి చేరుకున్నారు. మధ్యలో మోకాళ్ల పర్వతం దగ్గర ఆమె కొంతదూరం మోకాళ్లపై నడిచారు. తదుపరి స్వామిని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని జాన్వీ స్నేహితులు శిఖర్‌, ఒరీ ఇన్  స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియో ద్వారా చెప్పారు. తిరుమల అడ్వెంచర్‌ టూర్‌ ఎలా జరిగిందో అందులో తెలియజేశారు.

jan2.jpg

చెన్నైలోని జాన్వీ నివాసం నుంచి కారులో మూడు గంటలు ప్రయాణించి తిరుపతి చేసుకున్నామన్నారు. అనంతరం జాన్వీ బంధువులతో కలిసి నడక దారిన తిరుమల చేరుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ - శిఖర్‌ మోకాళ్లపై మెట్లెక్కారు. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ  "ఇప్పటికి 50సార్లు  తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానని, ఈ దేవాలయం అంటే తనకు  ఎంతో ఇష్టమని జాన్వీ చెప్పారు.
Ram jan.jpg

తాజాగా జాన్వీ హైదరాబాద్‌లో సందడి చేసింది. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. బుధవారం ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్  అయింది.  పూజా కార్యక్రమం అనంతరం జాన్వీకపూర్‌, ఆమె తండ్రి బోనీ కపూర్‌, ఇతర చిత్రబృందం రామ్‌చరణ్‌ నివాసంలో సందడి చేశారు. చరణ్‌తో సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను జాన్వీ ఇనస్టాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - Mar 21 , 2024 | 02:54 PM