Janhvi Kapoor: నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది!

ABN , Publish Date - Jan 04 , 2024 | 05:28 PM

బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌- దివంగత హీరోయిన్‌ శ్రీదేవి (Sridevi) పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) 2018లో ‘ధడక్‌’ సినిమాతో హీరోయినగా కెరీర్‌ ప్రారంభించింది. సెలెక్టివ్‌ సినిమాలతో ముందుకెళ్లున్న జాన్వీ 'దేవర’ (Devara) సినిమాతో తెలుగుతెరకు పరిచయం అవుతోంది.

Janhvi Kapoor: నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది!

బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌- దివంగత హీరోయిన్‌ శ్రీదేవి (Sridevi) పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) 2018లో ‘ధడక్‌’ సినిమాతో హీరోయినగా కెరీర్‌ ప్రారంభించింది. సెలెక్టివ్‌ సినిమాలతో ముందుకెళ్లున్న జాన్వీ 'దేవర’ (Devara) సినిమాతో తెలుగుతెరకు పరిచయం అవుతోంది. మరోవైపు తన సోదరి ఖుషీ కపూర్‌ కూడా ‘ద ఆర్చీస్‌’ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా వీరిద్దరూ కాఫీ విత్‌ కరణ్‌ 8వ సీజన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ మాతృమూర్తిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి మరణించిన క్షణాలను తలచుకుని ఎమోషనల్‌ అయ్యారు.

జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ.. ‘నాకు బాగా గుర్తుంది. నేను నా గదిలో ఉన్నప్పుడు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఇంతలో ఖుషి ఏడుస్తున్న శబ్థం వినిపించింది. ఓ పక్క రోదిస్తూనే తన గదిలోకి వెళ్లాను. అప్పుడు ఖుషి నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది. తను నా పక్కనే కూర్చుని నన్ను ఓదార్చడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తను కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడనేలేదు’ అని చెప్పుకొచ్చింది. అనంతరం ఖుషీ మాట్లాడుతూ.. ‘నేను కన్నీళ్లను ఆపుకోవాలని చూశాను. ఎందుకంటే మా ఇంట్లో అందరూ నేను చాలా స్ర్ట్టాంగ్‌ అనుకుంటారు. అందుకే ఏడవకూడదని బలంగా నిర్ణయించుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - Jan 04 , 2024 | 05:28 PM