Janhvi kapoor: తరచూ తిరుమల వెళ్లడానికి కారణం అదే!

ABN , Publish Date - May 27 , 2024 | 06:28 PM

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ కథానాయికగా బిజీగా ఉంది. ప్రస్తుతం తారక్‌తో 'దేవర', రామ్‌చరణ్‌తో సాన బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతుంది.

Janhvi kapoor: తరచూ తిరుమల వెళ్లడానికి కారణం అదే!

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ కథానాయికగా బిజీగా ఉంది. ప్రస్తుతం తారక్‌తో 'దేవర', రామ్‌చరణ్‌తో సాన బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతుంది. జాన్వీకి తిరుమల శ్రీవారు అంటే ఎనలేని భక్తి. తరచు తిరుమల వెళ్తుంటారు. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజు నాడు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు. ఇటీవల కాలి నడకన వెళ్లి స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే! తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తరచూ అక్కడకు వెళ్ళడానికి గల కారణాన్ని తెలిపారు. తన తల్లి మరణించిన తర్వాత చాలా అలవాట్లను మార్చుకున్నట్లు ఆమె చెప్పారు.

Jan-2.jpg

‘అమ్మ కొన్ని విషయాలను బాగా నమ్మేది. ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని పనులు చేయడానికి అంగీకరించేది కాదు. శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదు, అలా  చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని అని చెబుతుండేది. ఆరోజు నల్ల దుసులను కూడా వేసుకోనిచ్చేది కాదు. ఆమె బతికి ఉన్నప్పుడు ఇలాంటి వాటిని పట్టించుకోలేదు. మూఢనమ్మకాలు అని కొట్టిపడేసేదాన్ని. కానీ, ఆమె మా నుంచి దూరమయ్యాక వీటిని నమ్మడం మొదలుపెట్టాను. ఆమె కంటే నేనే ఇప్పుడు ఎక్కువగా విశ్వసిస్తున్నా. అమ్మ ఎప్పుడూ తిరుమల దేవుడి పేరును తలచుకుంటూ ఉండేది. షూటింగ్‌ గ్యాప్‌లో కూడా నారాయణ, నారాయణ అనుకుంటుండేది. ప్రతి ఏడాది పుట్టినరోజు స?స్వామి వారిని దర్శించుకునేది. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచు వెళ్తుంటాను’ అని అన్నారు. ప్రస్తుతం జాన్వీ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అపూర్వ మోహతా, కరణ్‌జోహార్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. క్రికెట్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్‌రావు, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు.

Updated Date - May 27 , 2024 | 06:28 PM