Kangana Ranaut: కంగ‌నా ర‌నౌత్‌ను.. చెంప‌దెబ్బ కొట్టిన కానిస్టేబుల్!వైర‌ల్

ABN , Publish Date - Jun 06 , 2024 | 06:48 PM

బాలీవుడ్ క్వీన్ తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో హామాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి ఎంపీగా విజ‌యం సాధించిన కంగ‌నా ర‌నౌత్ కు ఘోర అవ‌మానం జ‌రిగింది. చండీగఢ్ విమానాశ్రయంలో కంగ‌నాపై కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చేయి చేసుకుంది.

Kangana Ranaut: కంగ‌నా ర‌నౌత్‌ను.. చెంప‌దెబ్బ కొట్టిన కానిస్టేబుల్!వైర‌ల్
kangana

బాలీవుడ్ క్వీన్ తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో హామాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి ఎంపీగా విజ‌యం సాధించిన కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut)కు ఘోర అవ‌మానం జ‌రిగింది. అమె నిన్న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యోత్స‌వ సంబురాల్లో పాల్గొని తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో చండీగఢ్ (Chandigarh) విమానాశ్రయంలో కంగ‌నాపై అక్క‌డే డ్యూటీలో ఉన్న సీఐఎస్‌ఎఫ్ (CISF ) కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ (Kulwinder Kaur) చేయి చేసుకుంది. ఇప్పుడీ అంశం స‌ర్వ‌త్రా తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

kr.webp

వివ‌రాల్లోకి వెళితే.. ఇన్నాళ్లు సినిమా తార‌గా దేశ ప్ర‌జ‌లంద‌రిని అల‌రించిన కంగ‌నా (Kangana Ranaut) తాజాగా జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా హామాచ‌ల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని మండి (Mandi) పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి భారీ విజ‌యం సాధించారు. అనంతం అక్క‌డే సంబురాల్లో పాల్గొన్న అమె ఈ సాయంత్రం ఢిల్లీకి వెళుతున్న క్ర‌మంలో ఎయుర్‌పోర్ట్ బ్యాగేజీ చెక‌ప్ నిర్వ‌హించే క్ర‌మంలో అక్క‌డే విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ (Kulwinder Kaur) కంగ‌నా చెంప‌దెబ్బ కొట్టింది. దీంతో అక్క‌డ కాసేపు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అ కానిస‌స్టేబుల్‌పై ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసి కంగ‌నా అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.


అయితే ఈ ఘ‌ట‌న‌పై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కంగ‌నాను ల‌గెజీ స్కాన్ చేసే సమ‌యంలో అమె ఫొన్‌ను ట్రేలో వేయ‌కుండా నిరాక‌రించింద‌ని, అక్క‌డ డ్యూటీలో ఉన్న వారిని తోసివేసిన కార‌ణంగా అనుకోకుండా అలా జ‌రిగింద‌ని కొన్ని ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌లు తెలిపాయి. అయితే కంగానా ర‌నౌత్ (Kangana Ranaut) ప‌లుమార్లు నిర‌స‌న తెలుపుతున్న రైతులను ఖ‌లీస్తానీ తీవ్ర‌వాదుల‌తో పోల్చినందుకు కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ (Kulwinder Kaur) అమెను కొట్టిన‌ట్లు మ‌రికొన్ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఇదిలాఉండ‌గా కంగ‌నా ఎంపీగా గెలిచిన రెండు రోజుల‌కే ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డంపై అంతా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

రైతులు రూ.100, రూ.200ల‌ కోసం దీక్ష‌లో కూర్చుంటున్నారంటూ రైతుల దీక్ష‌ను కంగానా ర‌నౌత్ (Kangana Ranaut) అప‌హస్యం చేసింద‌ని, అ దీక్ష‌ల్లో మా అమ్మ కూడా పాల్గొందంటూ ఆ తర్వాత కానిస్టేబుల్ మ‌రో వీడియో వైర‌ల్ అవుతోంది.

Updated Date - Jun 06 , 2024 | 07:29 PM