Aditirao Hydari : ఎంత ప్రేమ చూపిస్తారో.. అంతే ప్రతీకారం తీర్చుకోగలరు

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:28 PM

సంజయ్‌లీలా భన్సాలీ (Sanjay leela Bhansali) దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ (Heeramandi)ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. మనీషా కొయిరాలా, అదితీరావు హైదరీ, సోనాక్షి సిన్హా, రిచా చద్దా కీలక పాత్రధారులు.

Aditirao Hydari : ఎంత ప్రేమ చూపిస్తారో.. అంతే ప్రతీకారం తీర్చుకోగలరు

సంజయ్‌లీలా భన్సాలీ (Sanjay leela Bhansali) దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ (Heeramandi)ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. మనీషా కొయిరాలా, అదితీరావు హైదరీ, సోనాక్షి సిన్హా, రిచా చద్దా కీలక పాత్రధారులు. మే 1 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం టీమ్‌ అంతా ప్రమోషన్స్ లో  బిజీగా ఉన్నారు. తాజాగా అదితీ ఓ మీడియాతో మాట్లాడారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘'ఈ సిరీస్‌లో నాది మృదుస్వభావం కలిగిన పాత్ర. వ్యక్తిగతంగా కూడా నేను అలానే ఉంటాను. చిన్నప్పటి నుంచి ఇంట్లో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దేనికోసం పోరాడాల్సిన అవసరం రాలేదు. నా తల్లిదండ్రులు కూడా ప్రతీ విషయంలోనూ సపోర్ట్‌ చేశారు. చిన్నప్పటి నుంచి నాకు ప్రేమపై నమ్మకం ఏర్పడింది. విశ్వాసం ఉంటే దేనినైనా సాధించగలం. మహిళలు చాలా విషయాల్లో సర్దుకు పోతుంటారు. నేను దేని గురించైనా ధైర్యంగా మాట్లాడతాను. ‘హీరామండీ’లో పాత్రను ప్రేక్షకులను మెప్పిస్తాయి. సంజయ్‌లీలా భన్సాలీ  స్త్రీలను  చూపించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్లు ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రతీకారం తీర్చుకోగలరు. ఇలా ఓ పాత్రను అన్ని కోణాల్లోనూ చూపించడం ఆయనకు మాత్రమే  సాధ్యం’’ అని అన్నారు.

ఈ సిరీస్‌లో అదితిరావ్‌ బిబ్బోజాన్‌ పాత్రలో నటించారు. వేశ్య వృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న కొంతమంది మహిళల జీవిత కథే ఈ సిరీస్‌.  

Updated Date - Apr 26 , 2024 | 05:30 PM