Adah sharma: అతనిపై కామెంట్‌ చేయడం కరెక్ట్‌ కాదు.. 

ABN , Publish Date - Apr 06 , 2024 | 05:06 PM

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushanthsingh rajputh) ఇంటిని నటి అదాశర్మ (adah sharma) కొనుగోలు చేశారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Adah sharma: అతనిపై కామెంట్‌ చేయడం కరెక్ట్‌ కాదు.. 

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushanthsingh rajputh) ఇంటిని నటి అదాశర్మ (Adah sharma) కొనుగోలు చేశారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదాశర్మ దీనిపై స్పందించారు. ‘‘ప్రస్తుతానికి నేను ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నా. అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు.  ఏదైనా ఓ విషయం మాట్లాడటానికి ఓ సమయం ఉంటుంది. ఆ ఇల్లు చూడటానికి వెళ్లినప్పుడు మీడియా నాపై ఎంతో ఫోకస్‌ పెట్టింది. అందుకు నేను సంతోషిస్తున్నా. వ్యక్తిగతంగా నేనొక ప్రైవేట్‌ పర్సన్‌ని. ఈ భూమ్మీద లేని ఒక వ్యక్తి గురించి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడటం సరైన పద్దతి కాదు. ఆయన గౌరవాన్ని కాపాడటం నా ముఖ్య ఉద్దేశం. మరణించిన వ్యక్తిపై కామెంట్లు చేయడం కరెక్ట్‌ కాదు’’ అని  అన్నారు. ఈ ఏడాది ‘కేరళ స్టోరీ’ చిత్రంతో మరోసారి పాపురల్‌ అయింది అదాశర్మ. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘ది గేమ్‌ ఆఫ్‌ గిర్గిత్‌’ చిత్రంప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది.

Ramayan: 'రామాయణ్‌’ కోసం ఆస్కార్‌ విన్నర్స్‌!


 

Updated Date - Apr 06 , 2024 | 05:08 PM