Mahesh-Venkatesh: చిన్నోడు, పెద్దోడు ఫోటో వైరల్ అయింది కదా, అసలు కథ ఇదీ...

ABN , First Publish Date - 2023-11-06T11:10:17+05:30 IST

మహేష్ బాబు, వెంకటేష్ పేకాట ఆడుతున్న ఫోటో ఒకటి నిన్నంతా సాంఘీక మాధ్యమంలో వైరల్ అయింది కదా. అసలు ఆ ఇద్దరూ అక్కడ ఎందుకు వున్నారు, దాని వెనకాల వున్న కథేంటి అంటే...

Mahesh-Venkatesh: చిన్నోడు, పెద్దోడు ఫోటో వైరల్ అయింది కదా, అసలు కథ ఇదీ...
Mahesh Babu, Venkatesh, Namrata attended for a private function

నిన్న అంతా సాంఘీక మాధ్యమంలో మహేష్ బాబు (MaheshBabu), వెంకటేష్ (Venkatesh)పేకాట ఆడుతున్న ఫోటో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఫోటో మీద చాలా వ్యాఖ్యానాలు కూడా పెట్టారు. మహేష్ బాబు, వెంకటేష్ పేకాట ఆడటం ఏంటి, ఆలా చేస్తారా అని. అలాగే మహేష్ బాబు, వెంకటేష్ ఇద్దరూ ఎక్కువగా పార్టీలలో కానీ, లేదా ఇంకేమైనా ప్రైవేట్ ఫంక్షన్ లో కానీ ఎక్కువగా కనిపించరు, మరి ఇద్దరూ ఆలా ఒక టేబిల్ దగ్గర కూర్చొని, పేకాట ఆడుతూ ఎలా కనిపించారు.

mahesh-venkatesh1.jpg

అలాగే ఈ ఇద్దరు నటులు ఎక్కువగా తమ కుటుంబ సబ్యులతోటే బయట కనపడతారు, అలాంటిది ఇద్దరూ ఒకే దగ్గర ఇలా కనిపించేసరికి సాంఘీక మాధ్యమంలో ఇంకేముంది నెటిజన్స్ తమకి నచ్చినట్టు ఈ ఫోటో మీద వ్యాఖ్యానాలు చేసేసుకున్నారు. ఇంతకీ అసలు ఏమి జరిగిందో తెలిస్తే అందరూ అవాక్కయిపోతారు. ఇది ఒక్క వెంకటేష్, మహేష్ బాబు మాత్రమే కాదు, చాలామంది సెలెబ్రిటీలు వచ్చిన ఫంక్షన్.

చిన్నోడు మహేష్ బాబు ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన ఒక క్లబ్ హౌస్ ఓపెనింగ్ కి పెద్దోడు వెంకటేష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ మహేష్-వెంకటేష్ క్లబ్బులో కార్డ్స్ ఆడుతున్న టేబుల్ దగ్గర కనిపించారు. అక్కడ ఆల్రెడీ వున్న టేబిల్ దగ్గర వున్న కొంతమందితో కలిసి సరదాగా పేకాట ఆడిన పిక్ అది. మహేష్ లేదా వెంకటేష్ అంత సీరియస్ పేకాట అదీ అంత ఓపెన్ క్లబ్ లో ఆడారు అంటే నమ్మగలమా, నమ్మలేము, అందుకే అది కేవలం ఆ క్లబ్బు ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఒక టేబుల్ దగ్గర మిగతా వాళ్ళతో కూర్చుని సరదాగా ఆడిన పిక్ అది. అయితే ఇది తెలిసేలోపే, ఎవరో తీసిన ఒక క్లారిటి లేని ఫోటో పట్టుకొని దాని మీద సాంఘీక మాధ్యమంలో మహేష్, వెంకటేష్ లపై రకరకాల ట్రోల్స్, మీమ్స్ షేర్ అయిపోయాయి.

mahesh-venkatesh2.jpg

అదీ కాకుండా, వెంకటేష్ 'జిగర్ తాండా' #JIgarthanda సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వెళ్లారు, అక్కడ తాను ఇంకొక ముఖ్యమైన కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉందని చెప్పటం, వెంటనే ఈ పేకాట ఆడుతున్న ఫోటోస్ బయటకు రావటంతో, ఇదేనా ఆ ముఖ్యమైన పని అని నెటిజెన్స్ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతుంటే, మహేష్ బాబు భార్య నమ్రత (NamrataShirodkar) కూడా ఈ క్లబ్బు ఈవెంట్ కి వెళ్లారు, ఆమె దానికి సంబందించిన ఫోటోస్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి 'వెల్ కమ్ టూ దీవాలి సీజన్' అని అన్నారు.

ఆమె ఒక్క మహేష్ బాబు, వెంకటేష్ ఫోటోస్ కాకుండా చాలామంది సెలబ్రిటీస్ వున్నా ఫోటోస్ పోస్ట్ చేశారు. అందులో ఇంకో అగ్ర నటుడు రామ్ చరణ్ (RamCharan) కూడా వున్నారు. అతను కూడా ఈ క్లబ్బు ఈవెంట్ కి హాజరయినవారిలో వున్నారు. దీనితో అందరికీ ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది, అది కేవలం సరదా కోసం ఆడిన ఫోటో అని.

Updated Date - 2023-11-06T11:27:32+05:30 IST