Samantha: అమెరికా నుండి ఇండియా వచ్చేసింది, దీనికోసమేనా?

ABN , First Publish Date - 2023-10-26T16:56:04+05:30 IST

విశ్రాంతి కోసం అమెరికా వెళ్లిన సమంత ఇప్పుడు ముంబై లో దర్శనం ఇచ్చింది. గత రెండు మూడు రోజులనుండి ఆమె ఫోటోలు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎందుకు ఇంత తొందరగా ఇండియా వచ్చినట్టు...

Samantha: అమెరికా నుండి ఇండియా వచ్చేసింది, దీనికోసమేనా?
Samantha

అగ్రనటి సమంత (Samantha) సాంఘీక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటుంది. 'ఖుషి' #Khushi సినిమా చేసాక, విశ్రాంతి కోసం అమెరికా వెళ్ళిపోయిన సమంత అక్కడ ఫోటోలు, ఆమె ఎక్కడెక్కడ వున్నదీ అవన్నీ అభిమానులతో పంచుకుంది. అయితే గత రెండు మూడు రోజుల నుండి ఆమె ఫోటోస్ మళ్ళీ వైరల్ అయ్యాయి, ఎందుకంటే ఆమె కొన్ని రోజుల క్రితం ఇండియా వచ్చింది. ముంబైలో ఆమె వున్నట్టుగా సాంఘీక మాధ్యమంలో ఆమె ఫోటోస్ వచ్చాయి. ఇంతకీ సమంత ఇండియా ఎందుకు తిరిగి వచ్చేసింది, సినిమాలు ఏమైనా ఒప్పుకుందా, లేక వెబ్ సిరీస్ ఏమైనా చేస్తోందా?

సమంత ఇండియా వచ్చింది తన రాబోయే 'సిటాడెల్' #Citadel వెబ్ సిరీస్ ప్రచారాల కోసం అని తెలిసింది. ఆ వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది అని, అందువలన ఆ ప్రచారాల్లో పాల్గొనడానికి వచ్చింది అని తెలుస్తోంది. రాజ్ డీకే (Raj&DK) లు ఈ వెబ్ సిరీస్ కి దర్శకులు కాగా, ఇందులో వరుణ్ ధావన్ (VarunDhawan) కథానాయకుడిగా చేసాడు. (RajNidimoru and Krishna DK)

samantha-new-mumbai2.jpg

ఇది ప్రియాంక చోప్రా (PriyankaChopra) నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ కి భారతీయ వెర్షన్ అని చెప్పారు. ప్రియాంక చోప్రా పాత్రని సమంత చేస్తోంది. ఇదిలా ఉండగా, కొన్ని బ్రాండ్స్ కి కూడా సమంత ప్రచారం చెయ్యాలని నిశ్చయించుకొని వచ్చింది. అందులో తాను సొంతగా నడుపుడుతున్న 'సాకి' (Saaki) ఒకటి. దానికి కూడా సమంత ఫోటోషూట్ చేసినట్టుగా తెలిసింది. సినిమాలు అయితే ఇప్పుడిప్పుడే కొత్తవి చెయ్యడానికి అంగీకరించక పోవచ్చు అని కూడా తెలిసింది. ఎందుకంటే ఆమెకి ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది.

Updated Date - 2023-10-26T16:56:04+05:30 IST